సిద్దు, రేష్మి జంటగా నటిస్తున్న సినిమా గుంటూరు టాకీస్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీగా తెరకేక్కుతున్న ఈ సినిమాలో శ్రద్దాదాస్ మరో హీరోయిన్గా నటిస్తుంది. నిన్న ఈ సినిమా సంబంధించిన దియోటర్ ట్రైలర్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ట్రైలర్కి మంచి స్పందన వస్తుంది.
ఇప్పటికే సుమారు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్న వారు వారి సొంత వాయిస్ను వుపయోగించనున్నారు. ఐతే ఈ సినిమా దర్శకుడు మాట్లాడుతూ చందమామ కథలు సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది.
చందమామ కథలు చిత్రన్నికి జాతీయ అవార్డు దక్కింది. అందుకే గుంటూరు టాకీస్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సామాజిక స్పృహతో తెరకెక్కుతున్న సినిమా ఇది. మంచి సందేశంతో పాటు ఫుల్గా వినోదంమూ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీ మంచు, రఘుబాబు, తాగుబోతు రమేష్, అపూర్వ తదితర నటినటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
{youtube}v=lX_FTeKKbcI{/youtube}