తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రాశి ఖాన్నా టైం నడుస్తుంది.ఎందుకంటే ఈ అమ్మడికి వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి.రవితేజతో టచ్ చేసి చూడు,వరుణ్ తేజ్తో తొలిప్రేమ చేసింది రాశి.అయితే మరో హీరోయిన్ ఛాన్స్లను కూడా ఈ భామ కొట్టేస్తుందని సమచారం.నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న రూపొందించనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. అందులో ఒక కథానాయికగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేతను ఖాయం చేశారు.
మరో కథానాయికగా సాయిపల్లవిని అనుకున్నారు.కాని సాయిపల్లవి బిహేవియర్తో నాని,నాగశౌర్యలను ఇబ్బంది పెట్టింది అని వార్తలు రావడంతో పాటు హీరో నాగశౌర్య స్వయంగా మీడియా ముందు సాయి పల్లవి గురించి నెగిటివ్గా చెప్పడంతో చిత్ర యూనిట్ ఆమె విషయంలో మనసు మార్చుకున్నారట.ఆ పాత్రకు ‘తొలి ప్రేమ’తో సత్తా చాటుకున్న రాశి ఖన్నాను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ‘తొలి ప్రేమ’తో రాశి కూడా మంచి పెర్ఫామర్ అని రుజువు చేసుకోవడంతో ఆమెతో వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారట.