ఈటీవి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. రేటింగ్స్ పరంగా అట్టర్ప్లాప్ అయిన ఈ టీవీకి జబర్తస్త్ కార్యక్రమం కొత్త ఊపిరిలూదడంతో పాటు రేటింగ్స్లోను టాప్ పొజిషన్కు తీసుకెళ్లింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కామెడీ ఆర్టిస్టులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
అలాగే జబర్దస్త్లో అడల్ట్ కామెడీపై కూడా భారీగా విమర్శలు కూడా వచ్చాయి. ఈ కార్యక్రమంలో నాగబాబు, రోజా జడ్జీలుగా కార్యక్రమానికి మంచి క్రేజ్ తీసుకొచ్చారు.అయితే రోజా ఒక బాధ్యత గల ఎమ్మెల్యే. అంత బాధ్యత గల పదవిలో ఉన్నరోజా జబర్దస్త్ ప్రతీ ఎంట్రీలోనూ డాన్స్ వెయ్యడం పై ప్రత్యర్ధి పార్టీలు విమర్శించడంతో వైకాపా నాయకులు కూడా మండిపడుతున్నారట.
రోజా అసెంబ్లీలో టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తే వారు ముందుగా జబర్దస్త్లో రోజా వ్యవహార శైలీని, ఆ బూతు షోకు యాంకర్గా ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. దీంతో జగన్ కూడా రోజా శైలి పట్ల అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రోజా స్వచ్ఛందంగానే జబర్దస్త్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందట.
రోజా స్ధానంలో రమ్యకృష్ణ ను కానీ, మీనాని కాని తీసుకోవాలని కార్యక్రమం నిర్వాహకులు భావిస్తున్నారట. పారితోషకం కూడా ఎక్కువగానే ఉండటం వల్ల వాళ్ళు కూడా ఇందులో చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రోజా స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారో వేచి చూడాలి.