వయసు మీద పడుతున్న హిట్ మీద హిట్ కొడుతు నిర్మాత పాలిటి కల్పవృక్షంలా మారారు సూపర్ స్టార్ రజనీకాంత్. రీసెంట్గా జైలర్తో ఇండస్ట్రీని షేక్ చేశాడు రజనీ. తన నటనతో మెప్పించాడు. హుకుం అంటూ రజనీ చెప్పిన డైలాగ్ సినిమాకే హైలైట్. ఇక రజనీతో సినిమా అంటే ప్రస్తుతం రూ.1000 కోట్ల వసూళ్లు గ్యారెంటీ అయిపోయింది.
అందుకే ఇప్పుడు రజనీ భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రజనీ…రూ.300 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇప్పుడి ఈ వార్త హాట్ టాపిక్గా మారింది.
జైలర్ సినిమా తర్వాత తన రెమ్యునరేషన్ని మరింతగా పెంచేశాడట. 2018 సంవత్సరంలో శంకర్తో 2.0 తర్వాత పెట్ట, దర్బార్, అన్నాత్తే అన్నీ మంచి విజయాలు సాధించాయి.ఇక రజనీ స్టామినాను మరింత పెంచేసిన మూవీ జైలర్. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ విజయం సాధించింది.
ఇక తర్వాతి ప్రాజెక్టును లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో జైలర్ నిర్మాత కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్పై చేస్తున్నారు రజనీ. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.