Wednesday, May 22, 2024
- Advertisement -

సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతుంది ఎవరినంటే..?

- Advertisement -

ఎస్‍ఎమ్‍ఎస్ సినిమాతో టాలీవుడు లో అడుగుపెట్టింది అందాల భామ రెజీనా.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో వరస అవకాశాలు దక్కించుకుంది. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ సరసన పిల్ల నువ్వులేని జీవితం సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది.

ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ లోను ఈ మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ సరసన జతకట్టింది. దీనితో రెజీనాతో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో పడ్డాడనే వార్త అప్పట్లో టాలీవుడ్ లో తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు లుగు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరి కాంబోలో వరసగా సినిమాలు వచ్చినప్పుడే వీళ్లు ప్రేమలో పడ్డారనే వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు అదంతా రూమర్ అని ఇద్దరు ఖండించారు. అయితే నిజంగానే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారనీ .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్త ఇప్పుడు మళ్ళీ బయటకు రావడం విశేషం.

ఇక ఈ విషయంలో సాయి ధరమ్ తేజ్ తన తల్లి దండ్రులను ఒప్పించే పనిలో ఉన్నాడని అంటున్నారు. అయితే రెజీనా మాత్రం కెరీర్ పీక్ లో ఉన్న కారణంగా కొంతకాలం ఆగితే బాగుంటుందని అంటున్నదట. ఇక ధరమ్ తేజ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఏంతవరకు ఉందో తెలియదు కానీ రెజీనా కూడా సమంతకానే స్టార్ ఫ్యామిలీకి కోడలు కాబోతుందని అందరు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -