Saturday, May 11, 2024
- Advertisement -

సాయి పల్లవికి ఈ రెంజ్ క్రేజ్ ఎందుకో తెలుసా..?

- Advertisement -

ఒక అమ్మాయిని.. ఒకే ఒక్క సినిమా.. ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఇప్పటివరకు తెలుగులో ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారిన హీరోలని చూసారు కానీ.. ఇక అమ్మాయి స్టార్ హీరోయిన్ కావడం ఫస్ట్ టైం చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నోట విన్న సాయి పల్లవి గురించే మాట్లాడుకుంటున్నారు.

ఆమె అలా చేసింది. ఇలా చేసింది. ఇరగదీసింది అనే మాటలు తప్ప మరో మాట వినిపించడం లేదు. ఇక కుర్రాళ్ళయితే అయితే సాయి పల్లవికి పెద్ద అభిమానులు అయిపోతున్నారు. మాకు కూడా సాయి పల్లవి లాంటి అమ్మాయి భార్యగా రావాలి అనే మాటలతో ఆమె మీద అభిమానం చాటుకుంటున్నారు. ఫిదా మూవీలో ఆమె నటనకు ఆడియన్స్ పిదా అయ్యారు. తెలుగులో ఒకప్పుడు సావిత్రి, తరువాత సౌందర్య, మరల ఇన్నేళ్ళ తర్వాత సాయి పల్లవి మాత్రమె అనేంతగా ఆమె గురించి ఇప్పుడు తెలుగు సినిమా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజ్ లేకుండా.. కేవలం యాక్టింగ్ కి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఇక తెలుగులో సాయి పల్లవి ఇమేజ్ ని అందరు కాష్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు.

ఇప్పటికే దిల్ రాజు సాయి పల్లవికి ఫిదా అయిపోయి మూడు సినిమాలు కాంట్రాక్టు చేసుకున్నాడు. నాని నెక్స్ట్ సినిమా ఎంసిఎ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా నటిస్తోంది. ఏది ఏమైన.. సాయి పల్లవి క్రేజ్ చూస్తుంటే.. ఆమె అతి త్వరలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లడం పక్కాగా కనబడుతోంది. ఇక ఫిదా మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది.

https://www.youtube.com/watch?v=gWaKn1SPxLw

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -