బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా ‘సంజు’ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సంజయ్ పాత్రను హీరో రణ్బీర్ కపూర్ పోషించాడు.ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో దాదాపు సంజయ్ జీవితంలో జరిగిన చాలా అంశాలను డైరెక్టర్ తెరపై చూపించాడు. సినిమాలో సంజయ్ దత్ పాత్ర హీరోయిన్స్, వేశ్యలు అందరితో కలిపి 350 మందితో రొమాన్స్ చేశానని చెబుతాడు.
ఈ విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.అయితే సంజయ్ దత్ అమ్మాయిలకు దగ్గరవ్వడం కోసం కొన్ని చిట్కాలు పాటించేవాడు. అందులో భాగంగా వాళ్లను స్మశానానికి తీసుకెళ్లి తన తల్లి సమాధిని చూపించి సానుభూతి పొందేవాడు. మా అమ్మ ఈ లోకంలో లేదు తనను పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అంటూ ఎమోషనల్ అయ్యి అక్కడే వాళ్లతో రొమాన్స్ చేసేవాడు. ఈ విషయన్ని చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఇక సినిమా మూడు రోజుల్లో 120 కోట్లు రాబట్టింది.