మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు 150వ సినిమాగా కత్తి రీమేక్లో నటిస్తున్నారు. ఈ 150వ సినిమాకి సంబంధించి ప్రీ ప్రోడక్షన్ పనులు మెదలు పెట్టినట్టు సమాచారం. చిరు సినిమాలో ఎవరు హీరోయిన్, ఎవరు విలన్ అనే విషయలపైనే అభిమానులతో పాటు సిని పరిశ్రమలో కూడా చర్చ జరుగుతుంది.
ఇక 150వ సినిమా షూటింగ్ జనవరిలో మొదలు అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు సిని పరిశ్రమలో ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించి చిరు రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. లైకా ప్రోడక్షన్స్ సంస్థ తమిళంలో కత్తి సినిమాని నిర్మించింది. మళ్ళీ ఇదే ప్రోడక్షన్ సంస్థ రాంచరణ్ తో కలిసి తెలుగులో చిరు సినిమాని నిర్మిస్తున్నారు.
ఐతే రజనీకాంత్ రోబో2 సినిమాని కూడా లైకా ప్రోడక్షన్ సంస్థే నిర్మిస్తుంది.రోబో2 సినిమాకి గాను రజినీకాంత్కు 30 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు చిరుకు కూడా అభిమానులో ఉన్న క్రేజ్ని చూసి 30 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
అయితే టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో మెగాస్టార్ చిరంజీవే అన్నమాట. ఇంత మొత్తం రెమ్యునరేషన్ చూసి చిరు అభిమానులు తెగ అనందపడుతున్నారట.