Thursday, May 2, 2024
- Advertisement -

నయనతార, హన్సిక లతో విడిపోవడం కారణం చెప్పిన శింబు..!

- Advertisement -

కోలీవుడ్ లో హీరో శింబుకి మంచి క్రేజ్ ఉంది. అయితే ఆయన లైఫ్ లో లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అవేవి పెళ్లి వరకు వెళ్లలేదు. అందుకు కారణాలు ఇటీవలే తమిళ ఛానెల్స్ తో పంచుకున్నారు. దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్స్‌ నయనతార, హన్సిక తదితర హీరోయిన్లతో ప్రేమలో పడ్డ శింబు.. వారితో బ్రేకప్ కు గల కారణాలను వెల్లడించారు.

తమిళ టెలివిజన్ సంగీతా క్రిష్ నిర్వహించే నచతిరా జన్నల్ అనే షో తమిళ బుల్లితెర మీద అత్యంత ప్రజాదరణ ఉన్న కార్యక్రమం. ఈ షోకు మంచి ఆదరణ ఉంది. లాక్‌డౌన్ పిరియడ్‌లో శింబుతో ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ చేసింది. అయితే ఒక ఫ్లో తన ప్రేమ వ్యవహారాలను పూసగుచ్చినట్టు వెల్లడించిన శింబు ఆ తర్వాత ఆ పోర్షన్‌ను తొలగించాలని కోరడం చర్చనీయాంశమైంది. ప్రేమ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే తన లవ్ ఎఫైర్లు బ్రేకప్ అయ్యాయని శింబు పేర్కొన్నారు. ప్రధానంగా నయనతార, హన్సిక ప్రేమ విషయంలో తాను చాలా పొరపాట్లు చేశానని.. అందుకే వారితో కొనసాగలేకపోయానని చెప్పునట్లు తెలుస్తోంది.

హోస్ట్ సంగీతా క్రిష్‌తో ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత నయనతార, హన్సిక గురించి మాట్లాడిన విషయాలు అప్రస్తుతమని శింబు భావించారట. దాంతో వారికి ఫోన్ చేసి ఇప్పుడు నయనతార, హన్సిక గురించి మాట్లాడటం భావ్యం కాదు. అందుకే ఆ విషయాలను ఇంటర్వ్యూ నుంచి తొలగించమని కోరినట్టు తెలిసింది. మళ్లీ విషయాలు మాట్లాడటం వల్ల వారు బాధపడే అవకాశం ఉంది. మానిపోయిన గాయాలను మళ్లీ కెలకడం ఎందుకని ఆయన అన్నట్టు తెలిసింది. శింబు చెప్పిన ఈ విషయాలన్నీఇంటర్వ్యూలో ఉంటాయా? అనేది ఆదివారం ఇంటర్వ్యూలో ప్రసారమైతే తప్ప చెప్పలేం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -