Thursday, May 2, 2024
- Advertisement -

సుధీర్ తో పెళ్లి గురించి రష్మీ చెప్పిన నిజాలు

- Advertisement -

బుల్లితెరపై మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ రష్మీ. ఈమె మొదట చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికి.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలో యాంకర్ గా చేసి.. బాగా క్రేజ్ సంపాధించుకుంది. ఆ క్రేజ్ తోనే ఆమె సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. నటిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది.

తాజాగా ఆమె నటించిన చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే సుడిగాలి సుధీర్ తో రష్మీ లవ్ ఎఫైర్ నడుపుతున్నట్లు తెగ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే మాటలుకూడా వినిపించాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ తో రష్మీ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నల అన్నింటికి రష్మీ సమాధానం చెప్పిమ్ది. సుడిగాలి సుధీర్ తో ఆమె ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావిస్తూ .. పెళ్లి చేసుకుంటారా? అంటూ అభిమానులు ప్రశ్నించారు.

తాను .. సుధీర్ కలిసి ఎక్కువ ఈవెంట్స్ చేస్తుండటం వలన అలాంటి భావన ఆడియన్స్ కి కలిగి ఉండొచ్చని రష్మీ తెలిపింది. తాము చేస్తోన్న షో మంచిగా రావడం కోసం మిగతా వాళ్లతో ఉన్నట్టుగానే సుధీర్ తోను కాస్త క్లోజ్ గా ఉండాల్సి వస్తుందనీ, అది చూసి తాము లవ్ లో పడ్డామని అనుకోవడం .. పెళ్లి చేసుకుంటారనే నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పింది. మరి రష్మీ క్లారిటీ ఇచ్చాక కూడా రూమర్స్ అగుతాయో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -