Sunday, April 28, 2024
- Advertisement -

సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని?

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల హ‌వ న‌డుస్తుంది.మ‌హ‌న‌టి సినిమా త‌రువాత ఇది మ‌రింత ఎక్కువ అయింద‌నే చెప్పాలి.ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రులు ఎన్టీఆర్‌,వైఎస్ఆర్ జీవిత క‌థ‌ల‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.వైఎస్ఆర్ పాత్ర‌లో మ‌ళ‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు.ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.అయితే సినిమాలోని ముఖ్య‌మైన పాత్ర కోసం సీనియ‌ర్ న‌టి సుహాసినిని సంప్ర‌దించార‌ని తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వెలిగిన సబితా ఇంద్రారెడ్డి క్యారెక్టర్ కోసం ఒకే చేసినట్లు సమాచారం. సబితా రెడ్డి మంత్రిగా వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న నాయకురాలు కావున ఆ పాత్రకు సినిమాలో ప్రాముఖ్యత ఉంటుంది.

ఈ పాత్ర‌కు సుహాసిని అయితే బాగుంటుంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌.దీనికి సుహాసిని నుండి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో ఆమె త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్‌లో పోల్గొంటుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేమ్ ఆశ్రితను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్‌.జ‌గ‌న్‌గా త‌మిళ హీరో సూర్య చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి వార్త‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -