బాహుబలి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ చిత్రంతో తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా 600 కోట్లు కలెక్షన్స్ వసుల్ చేసి అద్భుతం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం సాధించిన రికార్డులను బద్దల్ కొట్టాలి అని తమిళ తంబిలు చూస్తున్నారు. అలాటి ప్రయత్నమే చేయబోతున్నాడు తమిళ దర్శకుడు సుందర్ సి.
ఈ దర్శకుడు బాహుబలి మించిన సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా ఏ హీరోలతోనో తెలుసా?? టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, అలాగే తమిళంతో పాటు తెలుగులోను మంచి పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఈ భారీ చిత్రాన్ని నిర్మించేది ఎవరో తెలుసా తమిళంలోనే కాకుండా దక్షిణాదిన విశేష పేరు ప్రఖ్యాతులు పొందిన అగ్ర నిర్మాణ సంస్థ ”తేనాండల్ ఫిలిమ్స్ ” సంస్థ . ఈ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రాలలో అత్యధికం సక్సెస్ అయినవే కావడం గమనార్హం. ఇక మహేష్ తో బాహుబలి ని తలదన్నే సినిమా చేయాలనీ భావిస్తున్నాడు దర్శకులు సుందర్ సి . మరి మహేష్ ఆ సినిమా చేయడానికి అంగీకరిస్తాడా చూడాలి.