2019 ఎన్నికల్లో సినీ గ్లామర్ ప్రధాన పాత్రపోషించనుందనేది తెలసిందే. టీడిపీకి మందు నుంచి సినీ గ్లామర్ ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి మరింత సినీ గ్లామర్ రానుంది. తాజాగా తెలుగు స్టార్ హీరోయిన్ టీడిపీలో చేరనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సీతమ్మ వాకిట్లో…సిరిమల్లే చెట్టు చిత్రంలో ఆడి పాడి నంటించిన నటి అంజలి తెలుగులో స్టార్డమ్ తెచ్చకుంది. వెంకటేష్, బాలయ్య సరసన నటించిన చిన్నది…తమిళ,కన్నడ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజగా అంజలి పార్లమెంట్కు వెల్లింది. అక్కడ తెలుగు ఎంపీలును కలిసి మురిసిపోయింది. రాజకీయాలంటె ఇస్టమని తన మనసులో మాటలను బయటపెట్టేసింది.
వైసీపీనుంచి గెలిచి టీడిపీ వైపు అడుగులేస్తున్న కొత్తపల్లిగీత అంజలిని కలసి పార్లమెంట్ను అంతా చూపించింది.రాబోయె ఎన్నికలకు ముందే టీడీపీలో చేరి ప్రచారం చేస్తారనె టాక్ వినిపిస్తోంది.ఎన్నికల్లో పోటీ చేసె ఆలోచన చేయకపోయినా..ప్రచారం మాత్రం చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేస్తుందట.
కోనసీమకు చెందిన అంజలి రాజకీయ ఎంట్రీ ఇస్తె..అక్కడి జనాలు అమెకు మద్దతు తెలపడం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.మరో వైపు నటి హేమ కూడా వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రాజకీయాల్లో వఏమైన జరగొచ్చు.