ఒక సినిమాలో మరొక ఫామిలీకి చెందిన స్టార్ లు ప్రత్యేక రోల్స్ చెయ్యడం, ఒకే సినిమాలు పెద్ద హీరోలు , హీరోయిన్ లో విరివిగా కనిపించడం ఈ మధ్య కాలంలో బాగానే జరుగుతోంది. ఒక పాటలో కనిపించి ప్రత్యేక స్టెప్ లు చేసి సినిమాకి పవర్ పెంచే కొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నారు. తాజాగా విడుదల అయిన సైజ్ జీరో సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.
సైజ్ జీరోలో నాగార్జున తో పాటు తమన్నా , లక్ష్మీ మంచుల కామియో ఉంది అని చాలా హైప్ తీసుకొచ్చారు తీరా థియేటర్ లోకి వెళ్ళాక చూస్తే వారి కామియో పెద్దగా పండలేదు అని తెలుస్తోంది. జిమ్ లో సైకిల్ తొక్కుతూ ఒక్కొక్కరూ ఒక్క సెకండ్ కూడా కనపడలేదు. ఒక మంచి కామన్ కాజ్ కోసమే కనిపించారు కానీ స్టార్ లు రిజిస్టర్ అయ్యేంతగా కనపడలేదు.
ఎదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. నాగార్జున ఒక్కడూ ఫిట్ నెస్ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. తమన్నా – హన్సిక – రానా – శ్రీదివ్య – బాబీ సింహా వంటి వారు ఒక్క సెకండ్ అన్నా కనపడితే ఒట్టు. ఇదెక్కడి గెస్ట్ రోల్ బాబోయ్ అంటున్నారు అభిమానులు . సినిమాకి వారు బలం అనుకుంటే మినిమం కూడా స్క్రీన్ మీద కనిపించలేదు.