బోల్డ్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈషా గుప్తా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. సౌత్ లోనూ ఈ అమ్మడు పలు చిత్రాల్లో మెరిగింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’లో స్పెషల్ సాంగ్లో కనిపించింది. తాజాగా ఈషా గుప్తా ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ లో అడుగుపెట్టిన కొత్తతో తనను చాలా మంది కామెంట్ చేశారని చెప్పుకొచ్చింది. తన ముక్కు బాగోలేదనీ..చర్మం మెరిసిపోవడానికి ఇంజక్షన్ తీసుకోమని సలహా ఇచ్చారని తెలిపింది. అయితే ఆ ఇంజెక్షన్ ఖరీదు 9 వేలు అని తెలియడంతో వెనక్కు తగ్గినట్లు చెప్పింది.
అయితే కొందరు హీరోయిన్లు తెల్లగా కనిపించడానికి ఆ ఇంజక్షన్ వాడతారని ఈషా గుప్తా వెల్లడించింది. సినిమాల్లో రావాలంటే అందంగా కనిపించాలని నటీనటులపై చాలా ఒత్తిడి ఉంటుందని చెప్పింది. అందుకే తన కూతురు హీరోయిన్ కావడం తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పింది.
Also Read