Tuesday, May 14, 2024
- Advertisement -

వరుణ్ తేజ్ కి నాగబాబు చెప్పిన పాఠం ఇదే!

- Advertisement -
Varun Tej working with two movies

మెగాహీరోలలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ మెగా హీరోలు. సాధ్యమైతే 3 సినిమాలు సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ల ఆలోచనగా కనిపిస్తుంది. అయితే వీరిద్దరిలో వరుణ్ తేజ్ చాలా నిబద్ధతో సినిమాలలో నటిస్తున్నారు. అయితే కొన్ని మంచి మూవీస్ లో వరుణ్ నటించినప్పటికీ కమర్షియల్ గా బ్రేక్ ఇంకా రాలేదు.

ఇక ఫైనాన్షియల్ గా వరుణ్ తేజ్ బలంగా మారటానికి వరుస సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం. అందుకే మంచి కథ ఉన్న సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక 2016 లో విడుదలైన  ‘లోఫర్’ తర్వాత దాదాపు సంవత్సరం పైగానే గ్యాప్ తీసుకున్నారు వరుణ్. అయితే ఇంత గ్యాప్ ని ఇంకెప్పుడూ రాకుండా ఉండేందుకు ఈసారి వరుణ్ తేజ్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు.

అందుకే వరుణ్ రెస్ట్ లేకుండా పని చేస్తున్నారు. శ్రీను వైట్ల ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల ‘ఫిధా’ సినిమాలను ఏకకాలంలో కంప్లీట్ చేస్తున్నాడు. ఈ చిత్రాల కోసం పని చేస్తూ తీరికలేని సమయాన్ని వరుణ్ తేజ్ గడుపుతున్నారు. రెస్ట్ లేకుండా వరుస సినిమాలు చేస్తేనే స్టార్ డం అనేది వస్తుంది. ఏ మూవీ ఎప్పుడు ? ఎందుకు హిట్టవుతుందో ? అనేది ఒక్క ప్రేక్షకులపైనే ఆధారపడి ఉంటుందనేది వరుణ్ తేజ్ కి తండ్రి చెప్పిన పాఠం అని అంటున్నారు. అందుకే తండ్రి కోరక మేరకు వరుణ్ తేజ్ తన చిత్రాలతో బిజీగా మారారని అంటున్నారు. 

Related

  1. నాగబాబు దగ్గర అసలు డబ్బులు లేవా.. అందుకే ఆ పని చేయడం లేదా..?
  2. జబర్ధస్త్ షోకి నాగబాబు, రోజా రెమ్యునరేషన్ తెలుసా..?
  3. నాగబాబు, పవన్ ల గురించి నిజాలు చెప్పిన చిరు!
  4. ఫ్యాన్స్ కి నాగబాబు మళ్లీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -