మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా చిరుతో పలు సినిమాలు నిర్మించాడు. గత పదేళ్లలో నాగాబాబు.. పవన్తో గుడుంబా శంకర్, చరణ్తో ఆరెంజ్ సినిమాలు నిర్మించాడు. తను నిర్మించిన సినిమాలో ఎక్కువ శాతం ఫ్లాప్ అయినప్పటికీ క్రేజీ కాంబినేషన్లు కావడంతో ప్రతిసారీ నాగబాబు గట్టెక్కేసాడు.
ఆరెంజ్ సినిమా ప్లాప్ అయిన కానీ మగధీర తర్వాత వచ్చిన సినిమా కావడం వల్ల నాగబాబుకి ఎలాంటి నష్టం రాలేదు. బయ్యర్లు మునిగిపోయారు కానీ నాగబాబు మాత్రం ఒడ్డున పడ్డాడు. ఆ తర్వాత నాగబాబు ఏ సినిమాలు నిర్మించాలేదు. చిరంజీవి సినిమాలు మానేయడం ఒక కారణమైతే, సొంత మనుషులు తనని మోసం చేసి తన డబ్బులు చాలా వరకు కాజేయడం మరో కారణం. ఎప్పటికైనా మళ్లీ అంజనా ప్రొడక్షన్స్పై నాగబాబు సినిమా తీస్తాడని అనుకుంటూ ఉండగా తనయుడు వరుణ్ తేజ్ రంగ ప్రవేశం చేసాడు.
వరుణ్ హీరోగా నాగబాబు సొంత సినిమా వుంటుందని చాలా కాలంగా వినిపిస్తున్నా కానీ అతను మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వరుణ్ వరుసపెట్టి అన్నీ బయటి బ్యానర్లకే సినిమాలు చేస్తున్నాడు. కొడుకుతో సినిమా తీయడానికి నాగబాబు దగ్గర డబ్బులు లేవా లేక నిర్మాతగా తాను సక్సెస్ కాలేనని ఆయన ఇప్పటికే డిసైడైపోయి దూరంగా ఉంటున్నాడా? వరుణ్ మాత్రం ఇప్పుడు సినిమాకి మూడు కోట్లు తీసుకుంటూ బిజీగానే వున్నాడు. మరోవైపు నాగబాబు కూడా సింగిల్ కాల్షీట్ మీద లక్ష రూపాయలు సంపాదిస్తూ బాగానే గడిస్తున్నాడు. సొంత నిర్మాణం తలనొప్పుల కంటే ఇదే బెస్ట్ అనుకుంటున్నారేమో తండ్రీతనయులు.
Related