- Advertisement -
విభిన్న పాత్రలతో సినిమాలు చేస్తూ దగ్గుబాటి వెంకటేశ్ వెళ్తున్నారు. దర్శకుడు తేజ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాలో వెంకటేశ్ అధ్యాపకుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఫ్యామిలీ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ కూడా నటిస్తున్నాడట.
అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో సినిమా రంగానికి చెందిన వారే కాగా మిగతా నటీనటులందరూ కొత్త వాళ్లనే తేజ తీసుకుంటున్నాడంట. రెగ్యులర్ కథల్ని దూరం పెట్టి భిన్నత్వం ఉన్న స్క్రిప్ట్స్ను మాత్రమే ఒప్పుకుంటున్న వెంకటేశ్ గురు తర్వాత చేస్తున్న సినిమా ఇదే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారంట.