Saturday, May 18, 2024
- Advertisement -

శ్రీదేవితో బాల‌కృష్ణ ఎందుకు చేయ‌న‌న్నాడు..?

- Advertisement -

శ్రీదేవి 1975-90 వ‌ర‌కు సినిమాల్లో అగ్ర‌తార‌గా ఎదిగారు. ఆ స‌మ‌యంలో ఉన్న హీరోలంద‌రితోనూ న‌టించారు. శ్రీదేవితో న‌టిస్తే ఆ హీరోల‌కు మంచి హిట్లు ల‌భించాయి. సీనియ‌ర్ ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వ‌ర్‌రావు, శోభ‌న్‌బాబు, కృష్ణ‌, కాంతారావు, చంద్ర‌మోహ‌న్, వెంక‌టేశ్‌, చిరంజీవి చివ‌రికి నాగార్జున‌ ఇలా వీరంద‌రితో చేసిన శ్రీదేవి ఒక్క బాల‌కృష్ణ‌తోనే చేయ‌లేదు. శ్రీదేవి మ‌ర‌ణంతో ఇప్పుడు ఈ విష‌యంలో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ దాదాపు ఐదు భాషల్లో నటించిన శ్రీదేవి బాల‌కృష్ణ‌తోనే న‌టించ‌లేదు.

మూడు తరాల నటులతో నటించిన ఆమె బాల‌కృష్ణ‌తోనే ఎందుకు న‌టించ‌లేదో తెలియ‌డం లేదు. తండ్రులు, వాళ్ల‌ కొడుకులతోనే నటించిన‌ శ్రీదేవిని బాల‌కృష్ణ చేయ‌న‌ని చెప్పాడంట‌. నాగార్జునతో మొదట 1988లో ఆఖరి పోరాటం సినిమాలో శ్రీదేవి చేశారు. ఆ తర్వాత ఆరేళ్ల అనంతరం 1994లో గోవిందా.. గోవిందా సినిమాలోనూ నటించారు. బాల‌కృష్ణ స‌మ‌కాలీన హీరోలు చిరంజీవి, వెంకటేశ్, నాగార్జునతో శ్రీదేవి చేశారు. కానీ నంద‌మూరి బాలకృష్ణతో మాత్రం నటించలేదు.

అయితే బాల‌కృష్ణ‌తో సినిమా తీద్దామ‌ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ట‌. సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరిగితే సీనియ‌ర్ ఎన్టీఆర్ జోక్యంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాని స‌మాచారం. బాలకృష్ణనే శ్రీదేవితో నటించేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. రామారావుగారితో చాలా సినిమాలు హీరోయిన్‌గా చేసిన శ్రీదేవితో తాను చేస్తే బాగుండ‌ద‌ని బాలకృష్ణ ఆమె అభ్యంతరం చెప్పారట. మొత్తం మీద శ్రీదేవి బాలకృష్ణ త‌ప్ప అప్ప‌టి హీరోంద‌రితో న‌టించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -