Thursday, May 9, 2024
- Advertisement -

సాయిప‌ల్ల‌వి వ‌ల్లే నాగ‌శౌర్య గైర్హాజ‌రు

- Advertisement -

ఈ న‌డి మ‌ధ్య ఓ హీరోయిన్ ప్ర‌వ‌ర్త‌న‌పై తీవ్రంగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. నాని సినిమాలో, పైగా ఓ నిర్మాత‌ను, ఒక హీరోను ఇబ్బంది పెట్టింద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఒక్క సినిమాతో టాలీవుడ్‌కు హిట్ కొడితే అంత పొగ‌రు ఉండాలా అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్‌పై మ‌రో పుకారు వినిపిస్తోంది. ఆమె హీరోయిన్‌గా ఓ హీరోతో క‌లిసి సినిమా చేసింది. అయితే ఆ సినిమా ఆడియో విడుద‌ల వేడుక జ‌రిగింది. అయితే ఈ ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మంలో హీరో గైర్హాజ‌ర‌య్యాడు. దీనికి ఆ హీరోయిన్ వైఖ‌రే కార‌ణం అని వినిపిస్తున్నాయి. అస‌లు విష‌య‌మేమిటో చద‌వండి..

‘కణం’ సినిమా హ‌ర్ర‌ర్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో నాగ‌శౌర్య హీరోగా, సాయిప‌ల్లవి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. అయితే ఈ కార్య‌క్ర‌మానికి నాగశౌర్య గైర్హాజ‌ర‌య్యాడు. అతడిని పిలవలేదా.. లేక శౌర్యకే వీలు కాక రాలేదా అనేది తెలియడం లేదు. అయితే నాగ‌శౌర్య కావాల‌నే ఈ కార్య‌క్ర‌మానికి రాలేద‌ని తెలుస్తోంది. ఎందుకంటే సాయిప‌ల్ల‌వి ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌కేనంట‌.

అయితే ఔన‌నే స‌మాధానం ఇది చ‌దివితే తెలుస్తుంది.
‘ఛలో’ సినిమా ప్ర‌చారంలో భాగంగా ఒక టీవీ ఛానెల్‌లో నిర్వ‌హించిన ఓ షోలో పాల్గొన్నాడు. ఆ స‌మ‌యంలో ఒక గేమ్ ఆడాడు శౌర్య. యాంక‌ర్ ‘‘మీ కెరీర్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ కోస్టార్ ఎవరు’’ అని అడ‌గ్గా వెంట‌నే సాయిప‌ల్ల‌వి అని చెప్పేశాడు. అంద‌ర్నీ షాక్‌కు గురి చేసింది. ‘కణం’ షూటింగ్ స‌మ‌యంలో శౌర్యను సాయిప‌ల్ల‌వి బాగా ఇబ్బంది పెట్టిందంట‌. ఇదే కార‌ణం రీత్య‌ ‘కణం’ ఆడియో వేడుకలో శౌర్య రాలేదు అని తెలిసిపోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -