సుచీ లీక్స్ ద్వారా హీరోయిన్స్, హీరోల వ్యవహారాలు బయటపడ్డ విషయం తెలిసిందే. సుచీ లీక్స్ ద్వారా గాయని సుచిత్ర ఒక్కసారిగా చాలా ఫేమస్ అయిపోయింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని నగ్న నిజాలను అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సుచిత్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె మానసిక స్థితి దెబ్బతిన్నదని, విదేశాలకు వెళుతోందంటూ వ్యవహారం ముగించారు.
కానీ అసలు సుచిత్ర ఎక్కడ వున్నారన్నది సస్పెన్సుగా మారింది. ఆమె గురించి మీడియా ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం మానేసింది. కొంతకాలం సుచీలీక్స్ పేరిట రచ్చ చేసిన గాయని ఇపుడు ఎక్కడ వుందన్నది మాత్రం తెలియరావడంలేదు. ఇకపోతే ఆ లీక్స్లో బయటకొచ్చిన సంగీత దర్శకుడు అనిరుధ్ మాత్రం మంచి అవకాశాలు దక్కించుకొని ముందుకు వెళ్తున్నాడు.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రావోయే సినిమానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. అయితే అనురిధ్ కు పవన్ తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లే సుచిత్రకు కూడా పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో సుచిత్రకు పవన్ చాన్స్ ఇస్తే.. పవన్ గొప్పతనం మరోసారి బయటపనుంది.
Related