ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతిలోని సెక్రటేరియట్లో బాబును కలుసుకున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. గతంలో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో ఎటువంటి నిర్మానాలు చేపట్టకపోవడంతో ఆ భూమాలన్నిట్లను స్వాధీనం చేసుకుంటామని రెండు రోజుల క్రితం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలసిందే.
దీంతో ఆఘమేగాలమీద అనీల్ అంబానీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. వారిద్దరి భేటీలో ప్రధానంగా ల్లూరు జిల్లాలో ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అలాగే నెల్లూరు, విశాఖతో పాటుగా మరికొన్ని చోట్ల ప్రారంభించే ప్రాజెక్టులపై సీఎంతో అనిల్ అంబానీ చర్చించారట.
అంతకముందు అంబానీ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా… దర్శనం అనంతరం పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొద్ది రోజుల క్రితమే అనిల్ సోదరుడు ముఖేష్ అంబానీ కూడా అమరావతికి వచ్చి చంద్రబాబును కలిశారు. ఇప్పుడు అనిల్ అంబానీ రావడం ప్రాధాన్యత ఏర్పడింది.