Wednesday, April 24, 2024
- Advertisement -

మోదీకి లైన్ క్లియర్.. ట్రంప్ సైడ్.. ఆయనే నంబర్ వన్..!

- Advertisement -

ట్విట్టర్​లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్ర స్థానంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన్ను 6.47 కోట్ల మంది అనుసరిస్తున్నారు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ 8.87 కోట్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేవారు. వాషింగ్టన్​లోని క్యాపిటల్​ భవనంపై ట్రంప్​ మద్దతుదారుల దాడి అనంతరం ఆయన ఖాతాను ట్విట్టర్​ శాశ్వతంగా తొలిగించింది. దీంతో మోదీకి మొదటి స్థానం దక్కింది.

క్రియాశీలంగా లేని రాజకీయ నేతల్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతున్నారు.

ఒబామాకు 12.79 కోట్ల మంది ట్విట్టర్​లో అనుసరిస్తున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు ప్రస్తుతం 2.33 కోట్ల మంది ట్విట్టర్​ ఫాలోవర్లు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -