Thursday, May 2, 2024
- Advertisement -

ఘోర ప్రమాదం..13 మంది సజీవదహనం..!

- Advertisement -

పాకిస్థాన్​ పంజాబ్​ రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలాకతాయ్​-నరాంగ్​ మండీ రోడ్డు మార్గంలో బస్సు, వ్యాను ఢీ కొన్నాయి. దీంతో వ్యానులోని సిలిండర్​ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సయాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు మార్గం సరిగా కనపడక ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్​ ముఖ్యమంత్రి ఉస్మాన్​ బజ్దార్​ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -