Wednesday, May 15, 2024
- Advertisement -

న‌వ్యాంధ్ర‌లో కొలువుదీరిని కొత్త మంత్రివ‌ర్గం….

- Advertisement -

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త మంత్రి వ‌ర్గం కొలువు తీరింది. వెలగపూడిలోని సచివాలయం వేదికగా కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 25 మందితో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. సచివాలయంలో సీఎం చాంబర్‌ పక్కన ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. మంత్రుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం కోసం.. ఇక్కడ సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్, నూతనంగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారు.. ధర్మాన కృష్ణ ప్రసాద్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, , చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలత్తూరు నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, అంజాద్ బాషా, మాలగుండ్ల శంకర్ నారాయణ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -