- Advertisement -
చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తిరియా గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ సాయంత్రం 4గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టుల మృతి చెందారు.
ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.జిల్లా రిజర్వు గార్డ్, ప్రత్యేక టాస్క్ఫోర్స్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపట్టాయి. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలు సహా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.