- Advertisement -
కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన పోరాటానికి సినిమా నటి హేమ మద్దతు ఇచ్చారు. కాకినాడ లో జరిగిన కాపు మహిళా సదస్సు లో పాల్గొన్న హేమ సీఎం చంద్రబాబు మీద సీరియస్ అయ్యారు . కాపులకి రిజర్వేషన్ లని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు పట్టుకోకపోవడం బాధాకరం అన్నారు ఆమె.
కాపు ఉద్యమానికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నాను అన్నారు ఆమె. ఈ సమావేశానికి వచ్చినందుకు తనను సినీ పరిశ్రమలో తొక్కేస్తారనే భయం లేదని వ్యాఖ్యానించారు. కాపులకు బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన టీడీపీ ఇపుడు ఆ హామీని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఈ సందర్భంగా కంచాలను గరిటెలతో కొడుతున్న నిరసనలో హేమ భాగస్వామ్యం పంచుకున్నారు. ఇదిలాఉండగా 2014 ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి హేమ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.