Friday, April 19, 2024
- Advertisement -

90 మందిని చంపింది మేమే ప్రభుత్వ ప్రకటన..!

- Advertisement -

అఫ్గాన్ భద్రతా దళాలకు తాలిబన్లకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ దాడిలో 90 మంది తాలిబన్లు హతమయ్యారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కందహార్​లోని పంజ్వై, ఝరి, అర్ఘందాబ్, మైవాండ్ జిల్లాలలో ఈ ఉద్రిక్తతలు తలెత్తినట్లు అఫ్గాన్ రక్షణ శాఖ తెలిపింది. తాలిబన్ల దాడులను సైన్యం తిప్పికొట్టిందని వెల్లడించింది. వాహనాలను పేల్చేసే 15 ల్యాండ్​మైన్లను గుర్తించి, నిర్వీర్యం చేసినట్లు స్పష్టం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉపయోగించారని అనుమానిస్తున్న ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది.

అయితే అఫ్గాన్ ప్రకటను తాలిబన్ ఖండించింది. సైన్యంతో ఉద్రిక్తతలు తలెత్తనేలేదని పేర్కొంది. ఎలాంటి మరణాలు సంభవించలేదని వెల్లడించింది. 90 మంది మరణించారని ప్రభుత్వం చెప్పిన గణాంకాలు వాస్తవదూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. నైతిక స్థైర్యం కోల్పోయిన సైన్యానికి హామీలు ఇచ్చేందుకే తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించింది.

మరోవైపు, డిసెంబర్ 10న కందహార్​ రాష్ట్రంలోని ఝరి జిల్లాలో తాలిబన్లపై వాయు మార్గంలో దాడులు నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. ఏఎన్​డీఎస్ఎఫ్ చెక్​పాయింట్ వద్ద అఫ్గాన్ సైన్యంపై జరిగిన దాడికి బదులుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -