Wednesday, May 22, 2024
- Advertisement -

ప‌వ‌న్‌ ఎంతటి దేవుడో నేనూ చూస్తా.. క‌త్తి మ‌హేష్

- Advertisement -

గ‌త‌కొంత కాలంగా క‌త్తి మ‌హేష్‌, ప‌వ‌న్ అభిమానుల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రో సారి తెర‌పైకి వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త‌న అభిమానులు చేసే ఓవ‌ర్ యాక్ష‌న్ గురించి అన్నీ తెలుసని, ఆయ‌న‌ కావాల‌నే స్పందించ‌డం లేదని సినీవిశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి ఆగ్ర‌హం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. అయితె ఇప్పుడు మ‌రో సారి ప‌వ‌న్ కు స‌వాల్ చేశారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కొంద‌రు దేవుడని అంటున్నార‌ని, ఆయ‌న దేవుడా? అని మ‌హేశ్ క‌త్తి ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌వేళ త‌న ఫ్యాన్సు చేష్ట‌ల‌పై స్పందిస్తే తాను ప‌వ‌న్‌కి దాసోహం అయిపోతాన‌ని వ్యాఖ్యానించారు. జన‌సేనాని రిప్లై ఇస్తే తాను ఆయ‌న పార్టీలో చేరడానికి కూడా రెడీ అని మ‌హేశ్ క‌త్తి తెలిపారు.

త‌న ఫ్యాన్స్ ఇంతేన‌ని, మీ చావు మీరు చావండి అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పినా త‌న‌కు ఓకేన‌ని వ్యాఖ్యానించారు. త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పంద‌న మాత్ర‌మేకావాల‌ని ఆయ‌న నెగిటివ్‌గా స్పందిస్తాడా? పాజిటివ్‌గా స్పందిస్తాడా? అన్న విష‌యం త‌న‌కు అన‌వ‌స‌ర‌మ‌ని మ‌హేశ్ క‌త్తి అన్నారు.

అభిమానులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని దేవుడు అంటున్నార‌ని, ఆయ‌న ఎంత‌టి దేవుడో తానూ చూస్తాన‌ని మ‌హేశ్ క‌త్తి స‌వాల్ విసిరారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రాజ‌కీయాలను ప్ర‌క్షాళ‌న చేస్తాడ‌ని కొంద‌రు న‌మ్ముతున్నార‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ అభిమానుల తీరుపై స్పందిస్తే తాను కూడా ప‌వ‌న్‌ని న‌మ్ముతాన‌ని ఆయ‌న పార్టీ కోసం ప‌నిచేస్తాన‌ని అన్నారు. చూడాలి ప‌వ‌న్ అభిమానులు,ప‌వ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -