- Advertisement -
బీహర్ లో మందు ఇక నుంచి బంద్. నేటి నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ముందుగా మద్యాన్ని పాక్షికంగా నిషేధిస్తున్నామని, ఆ తర్వాత పూర్తి స్ధాయి మద్య నిషేధం అమలవుతుందని ఆయన తెలిపారు.
ప్రొహిబిషన్ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న నితీష్ కుమార్ దొంగతనంగా ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన శిక్షలు తప్పవన్నారు. ఎక్కడైనా మందు విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని బీహార్ ప్రజల సిఎం సూచించారు.