Friday, May 17, 2024
- Advertisement -

వేల జంటలకు వెంకయ్య తాళి కట్టిస్తారా?

- Advertisement -
ambati alleged venkaiah nidu is going to get marriage of those 9 thousand love couples

వైజాగ్: విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించాలని చూస్తోన్న లవ్ ఫెస్టివల్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు వైజాగ్‌లో ప్రత్యేకంగా లవ్ ఫెస్టివల్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విదేశాల నుంచి 9వేల మంది ప్రేమ జంటలు ప్రత్యేకంగా హాజరుకానున్నారు.

అయితే ఈ జంటలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దగ్గరుండి తాళి కట్టిస్తారా అని ప్రశ్నించారు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు. గతంలో భజరంగ్‌దళ్ వంటి సంస్థలు పార్కుల్లో కూర్చున్న పలు జంటలపై దాడులు చేసిన సందర్భాలున్నాయని, అందులో కొన్ని జంటలకు తాళి కూడా కట్టించారని అన్నారు అంబటి. దీంతో కేంద్ర మంత్రి వెంకయ్య కూడా వారికి ఇప్పుడు అలానే తాళి కట్టిస్తారా అని ప్రశ్నించారాయన.

అయితే ఈ ఫెస్టివల్‌ను ముంబైకి చెందిన ఓ కంపెనీకి అప్పగించడం ద్వారా నారా లోకేశ్ కోట్ల రూపాయిల కమీషన్ కొట్టేయబోతున్నాడని ఆరోపించారు అంబటి రాంబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -