ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే జగన్ దూకుడు పెంచాడు. ప్రభుత్వ యాంత్రాగాలను మార్చుతూ.. అధికారుల బదిలీలు చేస్తూ మార్పులకు నాంది పలుకుతున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్ల మార్పునకు శ్రీకారం చుట్టారు.
తాజాగా గుంటూరు జిల్లా పల్నాడులోని మాచర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను కూల్చివేశారు. పేదలకు రూ.5కే భోజనం అందించే ఈ క్యాంటీన్ ను ఎవరు కూల్చారో తెలియడం లేదు. అయితే కూల్చివేత మాత్రం కలకలం రేపుతోంది.
ఇక అన్నా క్యాంటీన్లను పూర్తిగా మార్చేసి రాజన్న క్యాంటీన్లుగా జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అయితే అధికారికంగా జరిగిందా..? స్థానిక ఎమ్మెల్యేలు ఇలా మారుస్తారున్నారో తెలియదు కానీ.. అన్న క్యాంటీన్ల పేరు మాత్రం వైఎస్ ఆర్ రాజన్న క్యాంటీన్ గా మారిపోతోంది.
ఇక చంద్రబాబు పథకాలు.. వాటి పేర్లను కూడా వైఎస్ఆర్ పేరుతో జగన్ మార్చడానికి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో వైసీపీ పథకాలుగా అవి చెలామణిలోకి రానున్నాయి. టీడీపీ వాసనలు పూర్తి స్థాయిలో తొలగించేందుకు వైఎస్ జగన్ నడుం బిగించారు. మళ్లీ వైఎస్ఆర్ పేరుతో ఆరోగ్యశ్రీ సహా అన్ని పథకాల పేర్లను మార్చనున్నారు.