Friday, May 17, 2024
- Advertisement -

మంత్రి నారాయణ కుటుంబంలో..విషాద చాయ‌లు

- Advertisement -
AP Minister Narayana son Nishit Narayana dies in road accdient

ఏపీ మున్సిప‌ల్ మంత్రి నారాయ‌ణ కుమారుడు కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు.దీంతో నారాయ‌ణ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.ఈ ప్రమాదంలో ఆయన స్నేహితుడు రాజా రవివర్మ ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36 వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు.బుధవారం తెల్లవారు జామున 2.30 గంటల నుంచి మూడు గంటల మధ్యలో మంత్రి కుమారుడు నిషిత్ ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా వచ్చి మెట్రో ఫిల్లర్ ను ఢీ కొట్టినట్లుగా చెబుతున్నారు. బెంజ్ కారులో ప్రయాణిస్తున్నప్పటికీ.. కారు వేగం చాలా ఎక్కువగా ఉండటంతో గాయాల తీవ్రత ఎక్కువగా ఉంది. కారులోపల బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ.. తీవ్ర గాయాలయ్యారు.
సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అన్న విషయం తెలీదు. పోలీసులు వచ్చే వరకూ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. గాయపడిన ఇద్దరిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించలేదు.

{loadmodule mod_custom,Side Ad 1}
ప్రమాద సమయంలో వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును అక్కడి నుంచి తీసివేశారు. నారాయణ కుమారుడు నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ కుమారుడి మరణ వార్త వినగానే హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు. ఈ సాయంత్రానికి నెల్లూరుకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కొడుకు మృతి వార్త విన్న వెంటనే నారాయణ సతీమణి.. కుటుంబ సభ్యులు.. సన్నిహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొని ఏపీ మంత్రి లోకేశ్ హైదరాబాద్ కు వస్తున్నారు. అపోలో ఆసుపత్రికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు..నారాయణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.వైసీపీ అధినేత జ‌గ‌న్‌తోపాటు వివిధ ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కులు సంతాపాన్ని ప్ర‌క‌టించార‌. నిషిత్.. రాజా రవివర్మ మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు తరలించారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత.. నిషిత్ భౌతికకాయాన్ని నెల్లూరుకు త‌ర‌లించ‌నున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -