- Advertisement -
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నో కష్టాలను ఎదుర్కుంటోందని, వీటి నుంచి బయట పడాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి పి.అశోక్ గజపతి రాజు డిమాండ్ చేశారు. విజయనగరంలో ఆయన బంగ్లాలో సోలార్ ప్లాంట్ ను ప్రారంభించారు.
అనంతరం స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి 60 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని, ఈ పరిస్థితుల్లో కేంద్రం ఆదుకుంటేనే రాష్ట్రం మనగలుగుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అన్నారు.