Monday, May 20, 2024
- Advertisement -

కమ్మవాళ్లనే బాబు అందలం ఎక్కిస్తున్నాడట!

- Advertisement -

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు మాదిగ దండోరా అధినేత మందకృష్ణమాదిగ. బాబు పాలన గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు మందకృష్ణ.

ఆంధ్రప్రదేశ్ పాలన, రాజధాని నిర్మాణం తదితర అంశాల గురించి మందకృష్ణ స్పందిస్తూ బాబుపై విమర్శలు గుప్పించాడు. ప్రత్యేకించి రాజధాని నిర్మాణం అంశం గురించి మందకృష్ణ బాబుపై విరుచుకుపడ్డాడు.

బాబు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి… ఏపీ రాజధానిని తన ప్రైవేట్ ఎస్టేట్ నిర్మాణంలా.. తన ఇంటి నిర్మాణంలా చేసుకొన్నాడని మందకృష్ణ మాదిగ అభిప్రాయపడ్డాడు. అలాగే బాబు పాలనలో ఆయన సామాజికవర్గానికి చెందిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందని మందకృష్ణ అన్నాడు. రాజధాని నిర్మాణ కమిటీలో ఏకంగా 90 శాతం మంది కమ్మవాళ్లకే ప్రాధాన్యత దక్కిందని.. ఇతర కులాలకు కానీ.. దళితులకు కానీ ఎలాంటి అవకాశాలూ దక్కలేదని మందకృష్న అన్నాడు.

మరి కులం కోణం నుంచి బాబుపై విమర్శలు రావడం ఇదేమీ కొత్త కాదు. ఈ మధ్యనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య బాబుపై ఇలాంటి విమర్శలు చేశాడు. బాబు పాలనలో ఆయన సామాజికవర్గానికే పెద్ద పీట పడుతోందని రామచంద్రయ్య ఆరోపించాడు. ఇప్పుడు మందకృష్ణ కూడా అవే ఆరోపణలనే రిపీట్ చేయడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -