Friday, May 10, 2024
- Advertisement -

విజయవాడలో క్యాంప్ ఆఫీస్: బాబు పారిపోయారా!

- Advertisement -

సోమవారం ఉదయం విజయవాడలో క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించుకొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మరి ఇది పెద్ద విశేషం కాదు కానీ.. ఈ క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సం జరిగిన సమయమే ఆసక్తికరంగా ఉంది. సరిగా ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పీకలోతులో ఇరుక్కుపోయిన సమయంలోనే ఏపీలో తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది.

హైదరాబాద్ వేదికగా జరిగిన స్కామ్ లో స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునే ఇరుక్కొన్నప్పుడే బాబుగారు విజయవాడలో క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించారు.

మరి ఒకరకంగా చూస్తే ఇది పారిపోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్ లో కూర్చొని వ్యవహారాలను చక్కచెబుతూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు వస్తాయని తెలుగుదేశం అధినేత గ్రహించినట్టుగా ఉన్నాడని.. ఇక్కడ ఏ వ్యవహారం చేసినా ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం తో చిక్కులు ఉంటాయని బాబుకు అర్థం అయ్యింది. అందుకు ఓటుకు నోటు స్కామే ఉదాహరణ. హైదరాబాద్ లో పవర్ తెలంగాణ రాష్ట్ర సమితి చేతిలో ఉండబట్టే కదా.. ఈ వ్యవహారం ఇక్కడి వరకూ వచ్చింది!

అందుకే తెలుగుదేశం పార్టీ తన రాజకీయాలను విజయవాడను కేంద్రంగా చేసుకోవాలని భావిస్తున్నట్టుగాఉంది. ఈ మేరకు లోకేష్ బాబు ఆద్వర్యంలో కూడా మంత్రాంగం జరిగిందని టాక్. మరి ఇప్పుడు బాబుగారు విజయవాడలో క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించుకొని.. అక్కడికి వెళ్లిపోతున్నారు. త్వరలోనే లోకేష్ అండ్ కంపెనీ కూడా అక్కడికే వెళ్లిపోతుందని పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -