Saturday, May 4, 2024
- Advertisement -

బైడెన్ సలహాదారుల్లో కీలక వ్యక్తికి కరోనా..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ దగ్గరి సలహాదారుల్లో ఒకరైన కెడ్రిక్​ రిచ్​మండ్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని బైడెన్​ అనుచరులు ధ్రువీకరించారు.అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి బైడెన్​ ఎక్కువగా డెలావర్​లోని తన ఇంటికే పరిమితమయ్యారు. ప్రచార కార్యక్రమం ఉండటం వల్లే ఆయన బయటకు వెళ్లారు.

జో బైడెన్​ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో రిచ్​మండ్ కీలక పాత్ర పోషించారు. నల్లజాతి ప్రజల ఓట్లను సంపాదించేందుకు కృషి చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో రిచ్​మండ్ కాంగ్రెస్ మొదటిసారిగా గెలుపొందారు. అప్పటి నుంచే బైడెన్​తో ఈయనకు అనుబంధం ఏర్పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -