- Advertisement -
సినీ నటుడు ప్రశాంత్ మృతి చెందాడు. కూకట్ పల్లిలోని భవనం పై నుంచి కిందికి పడి చనిపోయారు. మహిళతో వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. ప్రశాంత్ స్వస్థలం అనంతపురం జిల్లా గుంతకల్.
ఆంజనేయనగర్ కాలనీకి సమీపాన్నే ఉండే పవర్నగర్లోని ఓ మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. గురువారం ఆమె భర్త గుంతకల్కు వెళ్ళడంతో అపార్ట్మెంట్కు రావాల్సిందిగా బాల ప్రశాంతకు ఫోన్ చేసి చెప్పింది.
అనుమానమొచ్చిన భర్త.. అదే కాలనీలో ఉండే తన చెల్లెలికి, బావకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూసి రమ్మని పంపాడు. కాలింగ్ బెల్ ఎంత సేపు కొట్టినా తీయకపోవడంతో.. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో హీరో బాలప్రశాంత బాల్కనీ నుంచి డ్రైనేజీ పైపు సాయంతో దిగేందుకు ప్రయత్నించాడు. కానీ, పట్టుతప్పి ఆరు అంతస్తుల నుంచి కింద పడిపోయాడు.