వివాహేతర సంబంధం ముగ్గురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం దళితవాడకు చెందిన గోపి, పరిమళ భార్యాభర్తలు. భర్త తాగుడకు బానిస కావడంతో పరిమళకు వేలాయుధం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త గోపీకి తెలియడంతో ఇద్దరి హెచ్చరించినా ఫలితంలేకుండా పోయింది. ఇద్దరి మద్య గొడవులు జరగుతుండటంతో పరిమళ పిల్లను తీసుకొని పుట్టింటికి వెల్లింది.
పుట్టింటికి వెళ్లిన పరిమళను ఇంటికి రావాలని భర్త గోపీ కంటే వేలాయుధం ఎక్కువగా ఒత్తిడి చేశాడు. దీంతో పరిమళ ఇంటికి వస్తె భర్తతో మరోసారి గొడవులు జరుగుతాయని అతను ఉండగ రాలేనని చెప్పడంతో ఎలాగైనా గోపి అడ్డుతొలగించుకోవాలని వేలాయుధం ప్లాన్ వేశాడు.
గోపీకి మద్యం సేవించే అలవాటునే దానికి ఆసరాగా చేసుకున్నాడు. గోపి స్నేహితుడు అయిన మేఘవర్ణం అనే వ్యక్తిని పావుగా వాడుకున్నాడు.అతడికి మద్యం ఇచ్చి, మరో కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అందులో విషం ఉందని తెలియని మేఘవర్ణం దాన్ని గోపికి ఇచ్చాడు.
సగం మిగిలిన కూల్ డ్రింక్ బాటిల్ను తీసుకుని వెళ్లి ఇంట్లో ఫ్రిజ్లో పెట్టాడు. కూల్ డ్రింక్లో విషయం ఉందని తెలియని మేఘవర్ణం భార్య మాధవి ఆ కూల్ డ్రింక్స్ను తాగింది. వెంటనే పెద్ద పెద్దగా కేకలు వేస్తూ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మాధవి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు విషం కలిపిన మద్యం తాగడంతో గోపీ కూడా చనిపోయాడు.
మొత్తానికి వేలాయుధం, పరిమళ వివాహేతర సంబంధం వల్ల రెండు నిండు ప్రాణాలు పోయాయి. ఇప్పుడు గోపి ఇద్దరు పిల్లలు తండ్రిలేని వారయ్యారు. మేఘవర్నం పిల్లలు తల్లిలేని వారయ్యారు. వేలాయుధాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం వల్ల మూడు కుటుంబాలు రోడ్డుపాలయ్యారు.