- Advertisement -
ఏపీకి పత్యేక హోదా ఇవ్వక పోయినా అన్నీ చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రత్యేకహోదా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. విపక్ష పార్టీలన్నీ కలసి కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
తమ ప్రభుత్వంపై ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టడంపై ప్రధాని మోదీ విపక్షానికి ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానం వల్లే ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను బయటపెట్టే అవకాశం లభించిందని ఆయన చమత్కరించారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్కు ధన్యవాదాలు చెప్పారు.