వైఎస్ జగన్పై కత్తితో దాడి ఘటన ఇప్పుడు రాస్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.దర్యాప్తు విషయంలో తీవ్ర గందరగోలం నెలకొంది. ఇప్పటికే ఏపీ సిట్ను ఏర్పాటు చేయగా మరో వైపు కేంద్రంకూడా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. దాడి జరిగిన వెంటనే విమానయాన మంత్రి సురేష్ ప్రభు ఇప్పటికే విచారణకు ఆదేశించారు.
జగన్పై దాడి కేసులో నిజాలను నిగ్గు తేల్చేందుకు వెంటనే కేంద్ర దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గం ఠానేలంక గ్రామానికి కి కేంద్ర దర్యాప్తు బృందం చేరుకుంది.
గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు దాడి చేసిన సంగతి తెలిసిందే.ఎయిర్ పోర్టు లాంజ్ లో కూర్చొని ఉండగా.. పందెం కోళ్లకు కట్టే కత్తితో ఎడమచేతి భుజంపై దాడి చేశాడు. ప్రస్తుతం జగన్ హైదరాబాద్ లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వైపు ఏపీ పోలీసులు జగన్ వాగ్మూలం కోసం ఆసుపత్రికి చేరుకున్న సంగతి తెలిసిందే.