- Advertisement -
సమైక్య రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ఆ పనిని శాస్త్రీయంగా చేయలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తలాతోకా లేకుండా విడదీయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.
విభజన జరిగే సమయంలో అందరితో చర్చించమని తాను ఎన్నోసార్లు చెప్పానని, అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరి మాట వినలేదని ఆయన అన్నారు. విడదీసినందుకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించిదని, గడచిన ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు శాతం ఓట్లు కూడా రాలేదని అన్నారు.
రాష్ట్రానికి రాజధాని లేక, మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నామని సిఎం అన్నారు.