Sunday, May 5, 2024
- Advertisement -

అయ్యో బాలయ్యా.. బాబు అలా చేశారా?

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి నటవారసుడు బాలకృష్ణకు.. వియ్యంకుడు, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి వరుస షాక్ లు తగులుతున్నట్టున్నాయి. మంత్రి పదవి విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో పాటు.. రీసెంట్ గా తన సిఫారసులకూ బాబు నుంచి తగిన స్పందన రావడం లేదని బాలయ్య బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ ఆవేదనకు.. ఈ మధ్యే ఎదురైన ఓ సందర్భం కూడా కారణమైనట్టు ఆయన గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయవాడ. నవ్యాంధ్ర రాజధానికి కేంద్రం. తిరుమల శ్రీవారి దేవస్థానం తర్వాత అంతటి స్థాయి పేరు ప్రఖ్యాతులున్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానం కూడా అక్కడే ఉంది. అలాంటి చోట.. తన సన్నిహితుడైన ఓ సీనియర్ అధికారికి కనకదుర్గ ఆలయ ఈవో పోస్టు ఇప్పించాలని బాలయ్య అనుకున్నారట. ముఖ్యమంత్రి బావే కదా.. ఒప్పుకుంటారులే అన్న నమ్మకంతో బాబును అడిగితే.. తగిన స్పందన రాలేదట.

విషయం అక్కడితో ఆగలేదు. తాను సిఫారసు చేసిన అధికారికి ఈవో పోస్టు ఇవ్వకపోవడానికి కారణమేదైనా ఉండొచ్చు అని బాలయ్య సర్దుకున్నారట. కానీ.. తనకు మాట మాత్రం కూడా చెప్పకుండా.. మొట్టమొదటి సారి ఓ ఐఏఎస్ అధికారికి కనకదుర్గ ఆలయ ఈవో బాధ్యతలను బాబు అప్పజెప్పేసరికి.. బాలయ్య షాక్ తిన్నారట. తను సిఫారసు చేసిన వ్యక్తికి ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదో అర్థం కాక.. బాబు మౌనాన్ని ప్రశ్నించలేక.. అవమానానికి గురైనట్టు బాధపడుతున్నారట.

ఈ విషయం ఇప్పటివరకూ గుసగుసలుగానే వినిపిస్తోంది. కానీ ఇదే నిజమైతే.. బామ్మర్ది బామ్మర్దే.. రాజకీయం రాజకీయమే.. అని మరోసారి చంద్రబాబు నిరూపించినట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -