- Advertisement -
పోలవరం పంచాయితీ యడ్లగూడెం దగ్గర గురువారం మధ్యాహ్నం ఏపి సిఎం కాన్వయ్లోని పోలీస్ జీపు ఢికొనడంతో ఒక మహిళ మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం, యార్లపాటి మంగమ్మ(75), యెడ్ల దేవులమ్మ అనే పేరు గల ఇద్దరు మహిళలు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. సిఎం కాన్వాయ్లోని చివరి పోలీస్ జీపు ఢీకొట్టడంతో మంగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
ఇక దేవులమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది తెలుసుకున్న సిఎం చంద్రబాబు వెంటనే 5 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక ఇందిరమ్మ ఇల్లు మంగమ్మ కుటుంబానికి ప్రకటించారు. గాయాల పాలైన దేవులమ్మకు రెండున్నర లక్ష రూపాయలు ఆమె వైద్య ఖర్చులకు ప్రకటించారు.