Tuesday, May 7, 2024
- Advertisement -

అసెంబ్లీ స‌మ‌రం: జగ‌న్‌ను ఇబ్బంది పెట్టేందుకు బాబు మాస్ట‌ర్ ప్లాన్‌

- Advertisement -

బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వైసీపీ సిద్దం అవుతోంది. ప్ర‌తిప‌క్ష‌పార్టీ కూడా అధికార పార్టీని ఇబ్బంది పెట్టేందుకు అస్త్ర‌, శ‌స్త్రాలు సిద్దం చేసె ప‌నిలో ప‌డింది. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇప్ప‌టికే బాబు మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్లు స‌మాచారం. స‌మావేశాల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో ఎమ్మెల్యేల‌కు బాబు సూచ‌న‌లు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

అసెంబ్లీ స‌మావేశాల‌ను జ‌ర‌గ‌కుండా ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను సృష్టించేందుకు టీడీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలకు సిద్ద‌మ‌వుతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు కూడా కాక‌ముందే బాబుతోపాటు ఆ పార్టీ నేత‌లు జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కార్య‌క‌ర్త‌లు , నాయ‌కుల‌పై దాడులు జ‌రుగుతున్నాయని నానాయాగి చేస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ స‌మావేశాల్లో అదే ఎత్తుగ‌డ‌ను అవ‌లంభించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

బడ్జెట్ పై అర్థవంతమైన చర్చ జ‌రుపుతామ‌ని…ప్ర‌తి ఒక్క‌రికి మాట్లేడేందుకు స‌మ‌యం ఇస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. స‌జావుగా స‌మావేశాలు జ‌రుగుతే అది జ‌గ‌న్‌కే అడ్వంటేజ్ అవుతుంది. జ‌గ‌న్ విజ‌న్ ఏంటో దీని ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెల్తుంది. ఇలా జ‌ర‌గ‌కుండా స‌భ‌ను అడ్డుకొనేందుకు టీడీపీ మాస్ట‌ర్ ప్లాన్ అములు చేస్తోంది. అసెంబ్లీలో వీలైనంత గొడవ జరగాలి. వీలైతే మార్షల్స్ తో బైటకు నెట్టించుకుని సింపతీ క్రియేట్ చేసుకోవాలి. మా బిల్డింగ్ లు కూలగొట్టేస్తున్నారు, మమ్మల్ని మెడబట్టి బైటకు గెంటేస్తున్నారంటూ మరోసారి గగ్గోలు పెట్టాలి ఇదే అజెండాతో స‌మావేశాల‌కు సిద్ద‌మ‌వుతోంది. మ‌రి జ‌గ‌న్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -