Wednesday, May 15, 2024
- Advertisement -

మెగా కుటుంబంతో టచ్‌లో ఉంటున్న మంత్రి గంటా

- Advertisement -

గడచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్రుగా ఉంటున్నారు. ముఖ్యంగా కాపు నాడు కార్యక్రమాలు, అనకాపల్లికి చెందిన కొణతాల తెలుగుదేశంలో చేరినప్పటి నుంచి ముఖ్యమంత్రికి, మంత్రికి పొసగడం లేదని వార్తలొస్తున్నాయి.

దీనికి కారణం సరైనోడు ఆడియో ఫంక్షన్ లో బయటపడింది. ఈ వేడుక విశాఖపట్నంలో నిర్వహించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావే కారణమంటూ మెగాస్టార్ చిరంజీవి బావమరిది, నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. అంటే చిరంజీవి పార్టీ మూసేసినా ఇంకా గంటా శ్రీనివాస రావు ఆ కుటుంబంతో టచ్ లో ఉండడం ఎపి సిఎంకు నచ్చడం లేదట. ఇక్కడి విషయాలు అక్కడ చెబుతున్నారేమోనని బాబుకు అనుమానంగా ఉందట.

పైగా కాపు ఉద్యమ సమయంలో ముద్రగడతో మాట్లాడడానికి అదే వర్గానికి చెందిన గంటా ప్రయత్నించకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. త్వరలో జరుగునున్న ఎపి క్యాబినెట్ విస్తరణలో గంటాకు ఉద్వాసన తప్పదని జరుగుతున్న ప్రచారం.. అల్లు అరవింద్ ప్రసంగంతో మరింత బలపడింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -