Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీలోనే ఉంటే ఒక్కోరికి రెండు కోట్లు ఇస్తానన్న చంద్రబాబు?!

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని వీడుతున్న నేతలను కాపాడుకోవడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడా? అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోతుండటంతో ఆయన నష్ట నివారణల చర్యలు చేపట్టారా?

పార్టీ నుంచి బయటకు వెళ్లే ఆలోచనతో ఉన్న నేతలకు ఒక్కోరికి రెండు కోట్లరూపాయల చొప్పున ఇవ్వడానికి కూడా బాబు వెనుకాడటం లేదా?!

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ మాటలు చెబుతున్నారు. ఈ సందేహాలు కలిగించారు. తెలుగుదేశం పార్టీలో ఉంటామని ప్రమాణం చేస్తే.. చంద్రబాబు ఒక్కో నేతకూ రెండు కోట్ల రూపాయల సొమ్ములు ఇస్తామని అంటున్నారని… తలసాని చెబుతున్నారు. తనకు కూడా అలాంటి ఆఫర్ వచ్చిందని.. అయితే తను ఏ రోజూ బాబు దగ్గర చెయ్యి చాచలేదని తలసాని స్పష్టం చేస్తున్నాడు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో తనకు చాలా రోజులుగానే విబేదాలున్నాయని.. వివిధ అంశాల గురించి ఆయనతో తను విబేధిస్తూ వచ్చానని.. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి లోకేష్ ను తెచ్చి అధ్యోఉడిగా చేస్తానని బాబు అనడాన్ని తాను తప్పు పట్టానని.. తను పార్టీ మీటింగ్ లో అలా మాట్లాడిన రోజు సాయంత్రానికే తనను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవి నుంచి తప్పించారని తలసాని వ్యాఖ్యానించాడు. 

ఇది తెలుగుదేశం ను వీడటం గురించి తలసాని వెర్షన్ వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా..  ఈ తెలంగాణ మంత్రిగారి మాటలు అయితే ఆసక్తి కరంగా ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -