Saturday, May 18, 2024
- Advertisement -

అమరావతిపై చంద్రబాబు ప్లాన్ ఇదే..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చడానికి వైసీపీ ఆలోచన చేస్తుందంటూ ప్రచారం మొదలు పెట్టిన టీడీపీ దీనిపై ఉద్యమించాలని తాజాగా డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలను చిలువలు పలువులు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఉద్యమించాలని.. తద్వారా ప్రజల్లో టీడీపీపై సానుభూతి, అధికార వైసీపీపై వ్యతిరేకత తీసుకురావాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.

తాజాగా చంద్రబాబు ట్విట్టర్ వేదిక ఈ పోరుబాటపై స్పష్టమైన ప్రకటన చేశారు. రాజధాని విషయంలో వైసీపీ మంత్రుల వ్యాఖ్యలతో పరిస్థితి దిగజారిందని.. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. రాజధాని రైతులతో కలిసి త్వరలోనే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు కలిసి ఉద్యమానికి సిద్దమవ్వాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

తాజాగా చంద్రబాబు ఈ ఉద్యమంలో ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. టీడీపీతో పాటు జనసేన, వామపక్షాలు.. కలిసి వస్తానంటూ బీజేపీతోనూ కలిసి జేఏసీని ఏర్పాటు చేసి రాజధాని అమరావతి కోసం ఉద్యమించాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

ఇదే జరిగితే చంద్రబాబు అమరావతి విషయంలో మైలేజ్ పొందే చాన్స్ ఉంటుంది. ఇప్పటికే జనసేన, వామపక్షాలు అమరావతిపై పోరుబాట పట్టారు. బీజేపీ వచ్చినా రాకున్నా చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం వైసీపీ ఇరుకునపడడం ఖాయమంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -