తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. అది కూడా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొంటూ బాబు ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
శాసనసభలో ప్రత్యేక హోదా అంశం గురించి ప్రకటన చేస్తూ బాబు మధ్య లో జగన్ ను లక్ష్యంగా చేసుకొన్నాడు. తాము ప్రత్యేక హోదా అంశం గురించి పోరాడుతున్నామని.. అయితే వైకాపా వాళ్లు రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తోందని బాబు వ్యాఖ్యానించాడు. తమతో కలిసి వస్తే కలిసి రావాలి.. లేకపోతే లెక్కచేసేది లేదని బాబు అన్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రస్తావన తీసుకొచ్చాడు. జగన్ మాట్లాడిన మాటలను బాబు గుర్తు చేశాడు. జ్యోతీష్యులు చెప్పారు.. తాను సీఎం అవుతాను.. అని జగన్ చెప్పుకొంటున్నాడని.. అంటూ బాబు వ్యంగ్యంగా అన్నారు. జగన్ తీరు హాస్యాస్పదంగా ఉందని బాబు చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రిని అవుతానని పగటి కలలు కంటున్నాడని బాబు వ్యాఖ్యానించాడు.
ఈ విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి సెటైర్లు వేశాడు. జగన్ మోహన్ రెడ్డి వి పగటి కలలు అని కూడా బాబు వ్యాఖ్యానించడం విశేషం. జగన్ జ్యోతీష్యాన్ని నమ్ముకొంటాడని బాబు ఎద్దేవా చేయడం కూడా ఆసక్తికరంగా ఉంది. మరి దీనిపై వైకాపా వాళ్లు ఏమని సమాధానం ఇస్తారో!