ఛత్తీస్ గడర్లో ఒక పక్క ఎన్నికలు జరుగుతుంటే ..మరో పక్క ఎన్కౌంటర్లు, మందు పాతరల పేళుల్లతో దద్దరిల్లింది. ఎన్నికలను బహిష్క రించాలాని అన్నలు పిలుపు నిచ్చారు. బిజాపూర్ పమేద్ ఏజెన్సీలోకి పెద్ద సంఖ్యలో ఎంటరయ్యారు. అలర్టైన కోబ్రా బెటాలియన్లు కూంబింగ్ చేపట్టడంతో మావోయిస్టులు కోబ్రా దళాలకు మధ్య కాల్లులు జరిగాయం. ఈ ఎన్ కౌంటర్తో చివరకు ఐదుగురు మావోయిస్టులు హతమవ్వగా, కోబ్రా దళానికి చెందిన ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని హెలీకాప్టర్లో బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలింగ్ కేంద్రానికి కిలోమీటరు దూరంలోనే పేలుడు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సుక్మా జిల్లాలోని కొంటాలోని పోలింగ్ కేంద్రం వద్ద ఐఈడీని గుర్తించిన భద్రతా బలగాలు దాన్ని నిర్వీర్యం చేశాయి.